Mahaa Daily Exclusive

  ఏడాదిలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు: చంద్రబాబు

Share

రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం పీ4 పాలసీ తీసుకొచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయనకు టాస్క్‌ఫోర్స్ ‘స్వర్ణాంధ్రప్రదేశ్ 2047’పై రూపొందించిన నివేదికను అందజేసింది. ‘కుప్పం నుంచి డిజిటల్ హెల్త్ కార్డుల కార్యక్రమం చెపడతాం. ఆగస్టు 15 నుంచి వాట్సప్‌లో అన్ని పౌర సేవలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. ఏడాదిలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం’ అని తెలిపారు.