Mahaa Daily Exclusive

  శ్రీశైలం మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించుకున్న హైకోర్టు సీజే..!

Share

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తి దంపతులు స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దంప‌తుల‌కు ఈవో శ్రీనివాసరావు స్వామివార్ల శేష వస్త్రాలు, జ్ఞాపిక బహుకరించారు.