Mahaa Daily Exclusive

  ఏపీ అభివృద్ధి చెందడం జగన్‌కు ఇష్టం లేదు: సత్య కుమార్

Share

ఏపీ అభివృద్ధి చెందడం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఇష్టం లేదని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో డబ్బు బయటపడుతోందని.. వాటిని లెక్కించిన వ్యక్తి జగన్‌ అనుచరుడు కాదా అని మంత్రి ప్రశ్నించారు.