Mahaa Daily Exclusive

  సత్తుపల్లిలో నూతన ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం..!

Share

సత్తుపల్లి, మహా.
సత్తుపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన నూతన కార్తికేయ ఫిల్లింగ్ స్టేషన్ను ఆదివారం ఎమ్మెల్యే రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ విజయ్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు.

ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన సందర్భంగా యజమానులు గుండు ఉమామహేశ్వరరావు, వనమా గాంధీ, పసుమర్తి శ్రీనివాసరావు, గుండు శశాంక్, గుమ్మా పుల్లారావుకు ఎమ్మెల్యే, నాయకులు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో సత్తుపల్లి ఏ ఎం సి చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.