Mahaa Daily Exclusive

  ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక ప్ర‌జా ద‌ర్బార్ – కంది శ్రీ‌నివాస రెడ్డి గారు 

Share

నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడు ఏ అవ‌ర‌మొచ్చినా తాను అండ‌గా ఉంటాన‌ని వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తున్న‌ట్టు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి గారు అన్నారు. గురువారం పట్టణం లోని త‌న క్యాంపు కార్యాల‌యం లో ఏర్పాటు చేసిన ప్రజా దర్భార్ కు ఆయ‌న త‌న సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి గారితో కలిసి హాజ‌ర‌య్యారు. నియోజకవర్గంలోని ప‌లు ప్రాంతాల‌నుండి త‌ర‌లివ‌చ్చిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్ర‌జాద‌ర్బార్ లో త‌మ సొంత స‌మ‌స్య‌లు , గ్రామ స‌మ‌స్య‌లు, వార్డు, కాల‌నీల స‌మ‌స్య‌ల‌ను వారి దృష్టికి తెచ్చారు. త‌మ‌ సమస్యల పై ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించారు. ప్ర‌జాద‌ర్బార్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో అప్లికేష‌న్ల డాటాను ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ద్ర‌ప‌రిచి క్లీయ‌రెన్స్ అప్డేట్ తెలుసుకునే అవ‌కాశ‌ముంద‌న్నారు.ఆయా సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ పరిష్కారం కోసం శాయ శ‌క్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లను ద‌ర‌ఖాస్తుల రూపంలో అందించ‌వ‌చ్చ‌న్నారు. వాటి ప‌రిష్కారం కోసం త‌న శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌న్నారు ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.