Mahaa Daily Exclusive

  చివరి లబ్దిదారుడి వరకు పథకాలు అందిస్తాం అర్హులందరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు -మంత్రి పొన్నం ప్రభాకర్

Share

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతరం ప్రక్రియని, చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మంత్రి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తో కలిసి జిహెచ్ఎంసి హైదరాబాద్ నగర పరిధిలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతిపై జిహెచ్ఎంసి కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రేషనింగ్ అధికారి జిల్లా సరఫరా అధికారికి జోనల్ కమిషనర్లు, ఆయా ఉన్నతాధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇంటి స్థలం ఉన్న వారితో పాటు ఇంటి స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డులకు ఇప్పటి వరకు దరఖాస్తు చేయనివారు వార్డు సభలలో దరఖాస్తు చేసుకోవచ్చని, వార్డు సభలలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు గతంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో వచ్చిన దరఖాస్తులను, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల మంజూరికి గాను దరఖాస్తులను  స్వీకరించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.  క్షేత్ర స్థాయిలో ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించాలన్నారు. అధికారులందరూ టీమ్ గా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలాంబర్తి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, వెంకన్న, ఉపేందర్ రెడ్డి, రవికిరణ్, అడిషనల్ కమిషనర్ అలివేలు మంగ తాయారు, శివకుమార్ నాయుడు, సంబంధిత అధికారులు, రెవెన్యూ డివిజన ల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……..