Mahaa Daily Exclusive

  ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన…!

Share

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉ. 11 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన చంద్రబాబు.. మ. 12 గంటలకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో సమావేశం కానున్నారు.