Mahaa Daily Exclusive

  అయోధ్య దర్శనం, హారతి వేళల్లో మార్పు…!

Share

అయోధ్య లోని రామాలయ దర్శనం, హారతి వేళలను శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సవరించింది. భక్తులు భారీగా తరలి వస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. తాజా షెడ్యూల్ ప్రకారం భక్తులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని సందర్శించవచ్చు.