Mahaa Daily Exclusive

  తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో హై అలర్ట్…!

Share

తెలంగాణ –ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌లకు నిరసనగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్ బలగాలు అప్రమత్తమయ్యాయి. చర్ల, పూసుగుప్ప, మారాయిగూడెం, పైడిపల్లి, దుమ్ముగూడెం అటవీప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా ఇటీవల మావోయిస్టులు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.