భవిష్యత్తులో BRS పార్టీని దగ్గరకు కూడా రానివ్వమని బీజేపీ ఎంపీ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ గాంధీ ఆయన నియోజకవర్గాన్ని ప్రియాంకకు ఇచ్చినట్లే KTR కూడా కవితకు సిరిసిల్లను ఇవ్వాలి. రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలు మాత్రమే ఉంటాయి. కేటీఆర్ కింద పనిచేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టపడరు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు కూడా రానివ్వం’ అని పేర్కొన్నారు.
Post Views: 116







