Mahaa Daily Exclusive

  రేపు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన: TPCC చీఫ్

Share

ఎమ్మెల్యేల కోటాకు సంబంధించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్ఠానం రేపు(ఆదివారం) ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేల కోటాలో ఒకేసారి నలుగురు ఎమ్మెల్సీలను ఎన్నుకునే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్‌కు ఏళ్ల తరబడిగా సేవలందిస్తున్న వారు ఎమ్మెల్సీగా అవకాశం కోసం దరఖాస్తు చేసుకున్నారని, అందరి దరఖాస్తులను ఏఐసీసీకి పంపించామని తెలిపారు.