Mahaa Daily Exclusive

  నేడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడాపోటీలు…!

Share

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియం, డీఆర్‌ఎంసీ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని సుమారు 97 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు వివిధ ఆటల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. విజేతలకు 21న బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పతకాలు అందించనున్నారు.