తెలంగాణ బీజేపీ రాష్ట్రంలోని మరో ఎనిమిది జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం బీజేపి పార్టీ స్టేట్ ఎలక్షన్ కో-రిటర్నింగ్ ఆఫీసర్ గీతా మూర్తి జాబితా విడుదల చేశారు. ప్రస్తుత 8 మంది జిల్లాల అధ్యక్షుల ప్రకటనతో ఇప్పటివరకు ప్రకటించిన జిల్లాల సంఖ్య 36కు చేరుకుంది. మరో రెండు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించాల్సి ఉంది.
జిల్లా అధ్యక్షుడి పేరు
రంగారెడ్డి అర్బన్ – వానిపల్లి శ్రీనివాసరెడ్డి
రంగారెడ్డి రూరల్ – పంతగి రాజ్ భూపాల్ గౌడ్
వికారాబాద్ – కొప్పు రాజేశ్వర్ రెడ్డి
నాగర్ కర్నూల్ – వేముల నరేందర్ రావు
జోగులాంబ గద్వాల్ – టీ. రామాంజనేయులు
ఖమ్మం – నెల్లూరి కోటేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం – బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
భాగ్యనగర్ మలక్ పేట్ – వై. నిరంజన్ యాదవ్
Post Views: 133








