Mahaa Daily Exclusive

  ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం జగన్…!

Share

సాధారణంగా తెలుగు ప్రజలు ఉగాది పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఆ పండుగ తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైనది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.  విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని జగన్ కోరుకున్నారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ప్రతి ఇంట్లో ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని ఆకాంక్షించారు.