Mahaa Daily Exclusive

  సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు…!

Share

మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నాగబాబును ఎమ్మెల్యే కోటా కింద గురువారం ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భార్యతో కలిసి సచివాలయానికి వెళ్లిన నాగబాబు, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక త్వరలోనే ఆయనను రాష్ట్ర క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది.