Mahaa Daily Exclusive

  అంబటి రిట్ పిటిషన్‌పై విచారణ వాయిదా…!

Share

మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. వైసీపీ అధినేత జగన్‌తో పాటు తనపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగులు పెట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని పిటిషన్‌లో తెలిపారు.ఈ పిటిషన్ ను బుధవారం హైకోర్టు పోలీసుల వాదనలు వినింది. ఈ క్రమంలో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.