Mahaa Daily Exclusive

  నేడు ఏపీ కేబినెట్ సమావేశం..!

Share

రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీలో డ్రోన్ పాలసీ, విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పలు సంస్థలకు కేబినెట్ భూ కేటాయింపులు చేయనుంది. రాజధాని అమరావతిలో పలు పనులకు ఆమోదం ముద్ర వేయనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు సంబంధించి కేబినెట్‌లో చర్చించనున్నారు.