తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని BRS నేత RS ప్రవీణ్ కుమార్ విమర్శించారు. గత వారం రోజుల్లోనే నలుగురు మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయని ఆగ్రహించారు. ‘మేడ్చల్ MMTS రైలు భోగీలో మహిళపై అత్యాచారయత్నం జరిగింది. సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నాగర్కర్నూల్లో గుడి దగ్గర మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. పహాడీ షరీఫ్లో జర్మనీ మహిళపై అత్యాచారం జరిగింది’ అని మండిపడ్డారు.
Post Views: 47








