Mahaa Daily Exclusive

  ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మృతి..!

Share

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం–మారేడుమిల్లి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కొండమొదలు, కొయ్యలగూడెం, చింతకూలు అడవుల్లో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మృతిచెందారు. వీరిలో అగ్రనేత చలపతి భార్య అరుణ, గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, అంజు ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో భద్రతా దళాలు మూడు ఏకే 47లు స్వాధీనం చేసుకున్నాయి.