Mahaa Daily Exclusive

  అడవి బిడ్డల కోసం అల్లూరి విరోచిత పోరాటం చేశారు: రాజ్‌నాథ్‌సింగ్‌

Share

TG: గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు అనేక పోరాటాలు చేశారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. గెరిల్లా యుద్ధ నైపుణ్యాలతో బ్రిటిష్‌ వారితో ఆయన పోరాడారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన అల్లూరి జయంతి వేడుకల్లో రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. “అడవి నుంచి విప్లవం పుట్టించి బ్రిటిష్ వారిని గజగజలాడించిన వ్యక్తి అల్లూరి. ఆయన పుట్టిన గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నాం.” అని అన్నారు.

Latest