Mahaa Daily Exclusive

  గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కవిత..!

Share

HYD-సబ్జిమండిలోని గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ 51వ వార్షికోత్సవ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కవిత పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న కవితకు పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం బోనాల ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కవిత వెంట జాగృతి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆషాడమాస బోనాల సందర్బంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కవిత చెప్పారు.

Latest