AP: రాజమండ్రి మోరంపూడి జంక్షన్కు చెందిన టీడీపీ కార్యకర్త ఆకుల కృష్ణ మరణం పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. పార్టీకి కృష్ణ వంటి విలువైన కార్యకర్తను కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. వీరాభిమాని అయిన కృష్ణ ఇటీవల క్యాన్సర్తో పోరాడుతూ శుక్రవారం మృతి చెందారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన సమయంలో, కృష్ణ కోరిక మేరకు చంద్రబాబు స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే.
Post Views: 59








