Mahaa Daily Exclusive

  తెలంగాణ కులగణన సర్వే దేశానికే దిక్సూచి: భట్టి

Share

తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం భట్టి మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ హామీ మేరకు రాష్ట్రంలో  అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామన్నారు. ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు వివరించారు. కాంగ్రెస్‌ ఒత్తిడితో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్రం దిగి వచ్చిందని భట్టి వెల్లడించారు.