Mahaa Daily Exclusive

  నేడు తెలంగాణ‌ కాంగ్రెస్ నేత‌ల ‘చ‌లో ఢిల్లీ’..!

Share

నేడు (సోమ‌వారం) టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో చ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ నేత‌లు ప్ర‌త్యేక రైలులో చ‌ర్ల‌ప‌ల్లి నుంచి నాగ్‌పూర్‌కు వెళ్ల‌నున్నారు. ఉద‌యం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రైలు బ‌య‌ల్దేర‌నుంది. కార్య‌క‌ర్త‌ల‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, టీపీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ వెళ్ల‌నున్నారు. 5,6,7 తేదీల్లో ఢిల్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుపై ధ‌ర్నా చేయ‌నున్నారు.