Mahaa Daily Exclusive

  బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది: తుమ్మల

Share

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్‌ఎస్‌ పార్టీ నాశనం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఆదివారం నిర్వహించిన కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ నాశనం చేసినఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.