Mahaa Daily Exclusive

  వృద్ధాశ్ర‌మంలో బిస్కెట్ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేసిన కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తులు..!

Share

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో ప‌లుచోట్ల సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. త‌న జ‌న్మ‌దినం సేవా దినంగా పాటిస్తున్నాన‌న్నారు. మంగ‌ళవారం సాయంత్రం ప‌ట్ట‌ణంలోని కేఆర్కే కాల‌నీలో గ‌ల వృద్ధాశ్ర‌మాన్ని కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తులు సంద‌ర్శించారు.వృద్ధుల‌కు పండ్లు , బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసారు.త‌న‌కు త‌న కుటుంబానికి మీలాంటి పెద్ద‌ల ఆశీర్వాదం కావాల‌న్నారు.