AP: చేనేత సూరీడు ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలో నిర్మించే పార్కులో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని, అలాగే పార్కుకు ఆయన పేరు పెడతామన్నారు. రూ.74 కోట్లతో మంగళగిరి, వెంకటగిరి, రాజాం, ఉప్పాడ, శ్రీకాళహస్తిలో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. చేనేతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, చేనేతల అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లను సలహాదారుగా నియమించామన్నారు.
Post Views: 141








