Mahaa Daily Exclusive

  ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత..!

Share

TG: ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అనిశెట్టి రజిత కన్నుమూశారు. వరంగల్ కు చెందిన రజిత(67) నిన్న రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆదివారం ఓ పుస్తకావిష్కరణలో కనిపించిన ఆమె అకస్మాత్తుగా మరణించడం సాహితీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక అంశాలపై ఆమె రాసిన పుస్తకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. TG తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాయి. 500 కవితలు, 100 వ్యాసాలు, 30కి పైగా పాటలు రాశారు.