బిహార్లో బీజేపీ ఓట్లు దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఔరంగాబాద్ సభలో మాట్లాడారు. ‘బిహార్లో ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ విఫలమవ్వడంతో ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని బీజేపీ వాడుకుంటోంది. SIR పేరుతో ఓట్లు దొంగిలించే ప్రయత్నం చేస్తోంది. ఇది భారీ స్కామ్. ప్రజల ఓట్లను డిలీట్ చేస్తున్నారు’ అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి.
Post Views: 112







