Mahaa Daily Exclusive

  పేదలకు జీఎస్టీ సంస్కరణలు ఓ వరం: ఎంపీ పురందేశ్వరి

Share

AP: జీఎస్టీ సంస్కరణలు పేద, మధ్య తరగతి ప్రజలకు ఒక వరమని ఎంపీ పురందేశ్వరి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌లో శ్రీబాల త్రిపుర సుందరి దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. పురందేశ్వరి మాట్లాడుతూ.. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమైన వేళ ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం ఆనందదాయకమన్నారు. జీఎస్టీ తగ్గించి, ప్రజలకు మంచి చేసిన ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Latest