TG: తెలంగాణకు సింగరేణి ఆత్మలాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను ప్రకటించారు. ‘రాష్ట్రంలోనే సింగరేణి అతిపెద్ద సంస్థ. కోల్ ఇండియాలో కూడా లేని అలవెన్సులను సింగరేణి ఇస్తోంది. వందేళ్లకు పైబడి ఉన్న సింగరేణికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నాం’ అని తెలిపారు.
Post Views: 44






