కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబు నాయుడును ప్రశంసించారు. చంద్రబాబు తనకు పెద్దన్న లాంటివారని, దేశంలో సంస్కరణలు అమలు చేసిన నాయకుడని అన్నారు. ఆయన హై టెక్నాలజీ వినియోగంతో సమర్థ పాలన అందిస్తున్నారని తెలిపారు. గతంలో హైటెక్ సిటీని, ఇప్పుడు అమరావతిని నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. 3 పారిశ్రామిక సిటీలు ఏర్పాటవుతున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, విశాఖ చాలా అందమైన నగరమని పేర్కొన్నారు.
Post Views: 75







