Mahaa Daily Exclusive

  అంబులెన్స్‌లో ప్రసవం – తల్లి  శిశువు సురక్షితం

Share

 

 

దమ్మపేట,మహా ,మార్చి 19 :

అంబులెన్స్ లో ప్రసవం కాబడి ,తల్లీ శిశువులను సురక్షితంగా కాపాడిన ఘటన మండల పరిదిలోని గండుగులపల్లి లో తెలుగు ఉగాది సంవత్సరం రోజున చోటుచేసుకుంది. వివరాలు పరిశీలన చేస్తే..

దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన తాటి కృష్ణకుమారి ప్రసవ వేదనలతో బాధపడుతుండగా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే దమ్మపేట 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇ.యమ్.టి. చీమల రాము పరీక్షించగా ఆమెకు తీవ్ర ప్రసవ వేదనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను అంబులెన్స్‌లోకి తీసుకుని వైద్య పరీక్షలు చేసి

ఆసుపత్రికి తరలిస్తుండగా కృష్ణకుమారి ప్రసవ వేదనలు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లోనే సురక్షితంగా పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండగా, అనంతరం సమీప దమ్మపేట ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో చాకచక్యంగా స్పందించిన ఇ.యమ్.టి. చీమల రాము , పైలట్ లాల్‌సింగ్‌ను స్థానికులు అభినందించారు.

Latest