హైదరాబాద్:మహా.
తెలంగాణ గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్ర రావు రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.
గవర్నర్ గారు సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటూ దేశ సేవలో నిరంతరం కొనసాగాలని, ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలని పలువురు తమ సందేశాల్లో పేర్కొన్నారు. నిబద్ధత గల నాయకుడిగా, దేశం పట్ల అంకితభావం కలిగిన వ్యక్తిగా ఆయన చేస్తున్న కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. భగవంతుడు ఆయనకు దీర్ఘాయుష్షును ప్రసాదించాలని, దేశం గర్వించే విధంగా ఆయన మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు ప్రముఖులు తమ శుభాకాంక్షల్లో వ్యక్తపరిచారు. ఇంగ్లీష్, హిందీ , తెలుగు భాషల్లో ఆయనకు జన్మదిన సందేశాలు అందుతున్నాయి.






