Mahaa Daily Exclusive

  వెంకసాయినగర్‌లో ఘనంగా బోనాలు..

Share

 

కారేపల్లి, మహా: కారేపల్లి మండలం వెంకటసాయినగర్‌లో గురువారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామదేవతలైన బొడ్రాయి, ముత్యాలమ్మతల్లి, శ్రీ అంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్టించి ఏడాది పూర్తి అయిన సంధర్బంగా కాలనీ లో రెండు రోజులుగా పూజా కార్యక్రమాలను కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గురువారం పూజలు ముగింపు సందర్బంగా గ్రామదేవతాలకు నైవేధ్యంగా మహిళలు బోనాలను సమర్పించారు. బోనాలతో వెంకటసాయి నగర్ సందడిగా మారింది.