వరంగల్, మహా;
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తొలగించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. విగ్రహం తొలగింపుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ చర్యలను నిరసిస్తూ బుధవారం నర్సంపేట పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. ప్రజలు, వ్యాపారులు బంద్ కు సహకరించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.
Post Views: 6








