Mahaa Daily Exclusive

  చెప్పులు, తోలు పరిశ్రమకు మద్దతుగా ‘కేంద్రీకృత ఉత్పత్తుల పథకం’

Share

చెప్పులు, తోలు పరిశ్రమకు మద్ధతు ఇవ్వడానికి కేంద్రీకృత ఉత్పత్తుల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. లెదర్‌, నాన్‌ లెదర్‌ చెప్పుల ఉత్పత్తికి అవసరమైన అధునాతన యంత్రాలకు అనుమతులను సులభతరం చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రూ.400 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని, రూ.11 లక్షల కోట్లకుపైగా ఎగుమతులు జరుగుతాయని అంచనా వేశారు.