Mahaa Daily Exclusive

  మోడీ హృదయంలో మధ్యతరగతి ప్రజలు: అమిత్ షా

Share

ప్రధాని నరేంద్ర మోడీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ చోటు ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్ర బడ్జెట్లో రిబేట్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత పన్ను మినహాయింపు ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్ధిక శ్రేయస్సును పెంపొందించడంలో దోహదపడుతుందని తెలిపారు.