రాష్ట్రంలో కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలో అసాధారణ వేడి వాతావరణం నెలకొంటుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. మంగళవారం నందిగామ 38.4, కర్నూలు 37.2, మచిలీపట్నం 35.8, బాపట్ల 35.4, తుని 35.4, కావలి 35, నరసాపురం 34.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు పెరగొచ్చని ఐఎండీ ప్రకటించింది.
Post Views: 41








