Mahaa Daily Exclusive

  సర్వేలో పాల్గొననివారు సమాచారం ఇవ్వొచ్చు: Dy.CM భట్టి

Share

కులగణన సర్వేలో పాల్గొననివారిలో ఇప్పుడు ఆసక్తి ఉన్నవారు ముందుకొచ్చి సమాచారం ఇస్తే తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించే ప్రక్రియకు సర్వే సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి.. సర్వే జరిగిన తీరును, సమాచారాన్ని ప్రజల ముందుంచుతామన్నారు.