Mahaa Daily Exclusive

  రేషన్ పంపిణీలో కందిపప్పు మాయం!

Share

ఏపీలో ‘పేదల పొయ్యిపై పప్పు ఉడుకుతుంది’ అంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అటకెక్కింది. జనవరిలో సగం కార్డుదారులకు మాత్రమే కందిపప్పు సరఫరా చేసిన సివిల్ సప్లయిస్ కార్పొరేషన్.. ఫిబ్రవరిలో బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేసి చేతులెత్తేసింది.కందిపప్పు కావాలని అడుగుతున్న కార్డుదారులకు రేషన్ సరఫరా చేస్తున్న ఎండీయూ వాహనదారులు స్టాకు లేదని చెబుతున్నారు. దీంతో రేషన్ కార్డుదారులు నిరాశకు లోనవుతున్నారు