Mahaa Daily Exclusive

  ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు అసెంబ్లీకి వెళ్లను: జగన్

Share

అసెంబ్లీకి హాజరు కావడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేంత వరకు అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. తాడేపల్లిలో తన కార్యాలయం నుంచి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ఐదేళ్లు ఓపిక పట్టాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.