Mahaa Daily Exclusive

  జాకీర్ హుస్సేన్‌కు చిత్రపటానికి సీఎం రేవంత్ పుష్పాంజలి..!

Share

భారత మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ జాకీర్ హుస్సేన్ గారి జయంతి సందర్భగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా, దేశంలో విద్యా రంగం అభివృద్ధికి గొప్ప కృషి చేసిన విద్యావేత్తగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు ఎన్నో సేవలు అందించారని ముఖ్యమంత్రి గారు కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, ఎంపీలు డాక్టర్ మల్లు రవి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, కుందూరు రఘువీర్ గారు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.