Mahaa Daily Exclusive

  ముంబై దాడి నిందితుడి అప్పగింతకు ట్రంప్ అంగీకారం..!

Share

ముంబైలో భీకర ఉగ్రదాడి (2008)ని తలచుకుంటే ఇప్పటికీ వణుకుపుడుతుంది. అయితే, నాటి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వుర్ హుస్సేన్‌ను భారత్‌‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అనుమతిచ్చారు. ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన హుస్సేన్.. ప్రపంచంలో అత్యంత దుర్మార్గుల్లో ఒకడని, అతడిని న్యాయ విచారణ కోసం ఇండియాకు పంపడం తనకు సంతోషాన్నిస్తోందని తెలిపారు. ఇందుకు ప్రధాని మోదీ ట్రంప్‌కు క‌ృతజ్ఞతలు తెలిపారు.