Mahaa Daily Exclusive

  మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం: మంత్రి కొండా సురేఖ

Share

మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాణి రుద్రమదేవి నుంచి మొదలుకొని నేటి వ్యాపారవేత్తల వరకూ మహిళలు సమాజానికి వెన్నెముకగా ఉన్నారన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణలో మహిళా సంఘాలకు రుణాలిచ్చి, వ్యాపారాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.