Mahaa Daily Exclusive

  ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..!

Share

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పెండింగ్‌ హైవేలు, రీజినల్‌ రింగ్‌రోడ్డుపై నితిన్‌ గడ్కరీతో కోమటిరెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మోర్త్‌ సెక్రటరీ ఉమాశంకర్‌, నేషనల్‌ హైవేస్‌ చైర్మన్, సంతోష్‌ కుమార్‌ యాదవ్‌‌లను సైతం మంత్రి కోమటిరెడ్డి కలవనున్నట్లు సమాచారం.