Mahaa Daily Exclusive

  లేబర్ కోడ్ లు రద్దు చేయాలి – విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, మే 7 (మహా): కార్మిక వ్యతిరేక లేబర్ కోడులు రద్దు చేయాలని, విద్యుత్ సంస్థలను ప్రైవేటుకరించే 2020 నూతన విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో విద్యుత్ రంగా ఉద్యోగులందరూ పాల్గొనాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె. బ్రహ్మచారి తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఎన్పీడీసీఎల్ కంపెనీ ప్రధాన కార్యదర్శి బొల్లి వెంకటరాజు విజ్ఞప్తి చేశారు . బుధవారం ఎస్ ఇ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు . తెలంగారాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ యుఈఈయు- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా పని చేసి మరణించిన అమరజీవి కిరణ్ ఆరో వర్ధంతి సభ సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించటమే కిరణ్ కి ఇచ్చే నివాళని పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల పాలిట ఉరితాళ్ళుల్లోని విమర్శించారు .దేశవ్యాప్తంగా 2020 విద్యుత్ చట్టం రద్దు కోసం పంజాబ్ , ఉత్తరప్రదేశ్, గుజరాత్, కాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగులు,కార్మికులు సమరశీల పోరాటాలు నిర్వహించి విజయం సాధించారని అదే స్ఫూర్తితో కార్మిక హక్కులు కాలరాస్తున్న లేబర్ కోడులు రద్దు చేయాలని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, లేబర్ కోడుల అమలు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమేనని నాయకులు విమర్శించారు. దేశ ప్రజల ప్రయోజనాలను, కార్మిక హక్కులను పణంగా పెట్టి కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీల సేవలో తరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యుత్ సంస్థల వున్నందువలననే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందుతున్నాయని, లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ కంపెనీలకు అమ్మటం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం బలహీన పరుస్తుందని విమర్శించారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మిక హక్కుల కోసం కామ్రేడ్ కిరణ్ నాయకత్వంలో సిఐటియు నిర్వహించిన పోరాటాల వల్లనే వేలాది వేలాదిమంది కార్మికుల పర్మినెంట్ అయ్యారని గుర్తు చేశారు. ఆర్టిజన్స్ కన్వర్షన్ కోసం సిఐటియు మార్గదర్శకత్వంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ చేస్తున్న పోరాటాలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ఈపీఎఫ్ నుండి జిపిఎఫ్ కు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా ఎస్ ఇ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎస్ ఇ కార్యాలయం ముందు ధర్నా అనంతరం ఎస్ ఈ కి వినతిపత్రం అందజేశారు. సమస్యను ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎస్ ఇ హామీ ఇచ్చారు. సిఐటియు కార్యాలయంలో కిరణ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వర్ధంతి సభకు తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి పులి గణేష్ అధ్యక్షత వహించారు. వర్ధంతి సభ మరియు ధర్నా కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కొలగాని రమేష్, జిల్లా అధ్యక్షులు కూను రాజు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాములు ,జిల్లా నాయకులు పదిలం శ్రీనివాస్ జి వెంకన్న, ఏడుకొండలు కనుకు సత్యనారాయణ , జిలాని తోకల శ్రీను ,వెంకటపతి రాజు తదితరులు పాల్గొన్నారు.