Mahaa Daily Exclusive

  చెక్ పోస్టులో సిపి ఆకస్మిక తనిఖీలు జంతువుల రక్షణ చర్యలపై ఆరా ..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:
మంచాల మండలం, ఆగపల్లిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను తనిఖీ చేసి పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. బొలెరో, డీసీఎం తదితర వాహనాలను కచ్చితంగా చెక్ చేయాలని సూచించారు. ఎవరైనా జంతువులను తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, పట్నం ఏసీపీ కేపివి రాజు, మంచాల సీఐ మధు, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.