ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ పాలనను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన నిమ్మల.. జల్జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని గవర్నర్కు ఫిర్యాదు చేయడం విడ్డూరమన్నారు.
Post Views: 89







