Mahaa Daily Exclusive

  చంద్రబాబు పాలన చూసి రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి కొండపల్లి

Share

AP: సీఎం చంద్రబాబు పాలన చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆదివారం విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి మరిన్ని కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి తెలిపారు. పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమల స్థాపనతో స్థానిక యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటున్నామన్నారు.